Apallnews.com
......:->గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాజభవన్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని జగన్ ఈ సందర్భంగా గవర్నర్ను కోరినట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
కాగా రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ నోట్కు ఆమోదముద్ర పడకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇదివరకు గవర్నర్కు ఒక వినతిపత్రం అందజేయడం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అసెంబ్లీ తీర్మానం కోరడం లేదన్న విషయం రూఢి అయిపోయి కేవలం అభిప్రాయానికి మాత్రమే బిల్లును పంపుతారని తేలిపోయిన నేపథ్యంలో మరోసారి జగన్ ....గవర్నర్తో భేటీ అయ్యారు.
13/10/2013
స్నేహితులకు, బందువులకు, మన తెలుగువారందరికీ విజయదసమి శుభాకాంక్షలు....
11/10/2013
...:->మళ్లీ 'సుడిగాడు' జంట వస్తోంది
ఆమధ్య వచ్చిన 'సుడిగాడు' సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచి విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. ఇందులో హీరో హీరోయిన్లుగా జోడీ కట్టిన అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ మళ్లీ ఇప్పుడు మరోసారి జతకడుతున్నారు. నరేష్ హీరోగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా మోనాల్ గజ్జర్ ను ఎంచుకున్నట్టు సమాచారం. అంబికా కృష్ణ నిర్మించే ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Hyderabad