M6TV

M6TV

Share

Photos from M6TV's post 17/09/2024

పత్రికా ప్రకటన,,17,09,2024
*************************
నాంసాని పల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

పెద్దపల్లి జిల్లాలో 100 అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు, సన్న హాలు,

విగ్రహ ప్రదాత,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ ( వాసు,)

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, అంబేద్కర్ యూత్ అండ్ అసోసియేషన్, ఆధ్వర్యంలో మంగళవారం ఓదెల మండలం నాంసాని పల్లి గ్రామంలో సమావేశం జరిగింది, నాంసానిపల్లి గ్రామ అంబేద్కర్ యూత్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లాల రామ్ నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కురుమ పల్లి మాజీ,సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూరు విగ్రహాల ప్రధాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆసం పల్లి లక్ష్మీ పౌండేషన్ చైర్మన్ ఆసం పల్లి శ్రీనివాస్ ( వాసు), ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇరుగురాల క్రిష్టయ్య, జిల్లా కోకన్వీనర్ సంకెనపల్లి లక్ష్మయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా నూరు అంబేద్కర్ విగ్రహాల,పదాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్,(వాసు,) మాట్లాడారు, భారతదేశానికి దిక్సూచి ప్రపంచ మేధావి, భారతరత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు అణ గారిన,వర్గాలకు స్ఫూర్తిని స్తుందన్నారు
దళిత అనగారిన,వర్గాల తో పాటు అన్ని వర్గాలకు అన్ని హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఆయన విగ్రహాలను పెద్దపల్లి జిల్లాలోని గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తామన్నారు,నూరు అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్టాపనే ధ్యేయంగా పనిచేస్తానన్నారు, అంకితభావంతో పనిచేస్తున్న ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం సేవలను అభినందించారు, క్రమశిక్షణ కలిగిన,అంబేద్కర్ సంఘం నాయకుల తో కలిసి పని చేయడం సంతోషకరమన్నారు,, అంబేద్కర్ విగ్రహాలు అవసరం ఉన్నవారు,

Photos from M6TV's post 09/09/2024

Gift to vinayaka mantapam

05/09/2024
03/09/2024

ఔను నిజమే. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం.

ఎవరి అభిరుచి, సామర్ధ్యం, నైపుణ్యం ఆధారంగా వారికి పని కల్పించబడాల్సిందే.

ఐతే సామర్ధ్యాలకు, నైపుణ్యంలకు కొలమానాలేమిటీ ? తరతరాలుగా బ్రాహ్మణులు మంత్రాలను బట్టీపట్టి చదివినట్లు చదవడమే నైపుణ్యమా ? నేటి చదువు అంతకంటే వేరేగా ఉందా ?

మరి నా సామర్ధ్యాన్ని ఎలా కొలుస్తారు ? బట్టీపట్టే నా సామర్ధ్యం ఆధారంగానా ? ఐతే అది నాకు రాదు. అది విజ్ఞానమే కాదు.
నాది పని సంస్కృతి. సోమరి మంత్రాల సంస్కృతి కాదు

మరి మాది మా ముత్తాత ముత్తాతలు తమ వృత్తిలో, చేసేపనిలో నుండి రూపొందించుకున్న సైన్స్ వారసత్వం. నా ఆచరనాత్మక సైన్స్ సామర్ధ్యం ప్రాక్టికల్స్ ల తెలుస్తది. కార్పోరేట్ కాలేజీల్లో లక్షలు పోసి చదివి ప్రాక్టికల్స్ ఒక్కరోజు కూడా చేయకుండా 30 కి 30 మార్కులు వచ్చేవాళ్ల సామర్ధ్యలేమిటీ ? వాళ్ళకు ఆ ప్రతిభ ఎలా వచ్చిందో ?
మరి ఇది రిజర్వేషన్ కదా !

అదిగో ఈ కార్పోరేట్ రిజర్వేషన్ కు నేను వ్యతిరేకం.

అసలు రిజర్వేషన్ల చరిత్ర ఏమిటీ ? ఎక్కడ మొదలైనాయి ?

అన్నీ వేదాల్లోనే ఉన్నాయష !

Any doubt ?

పుట్టుకల రిజర్వేషన్ ఋగ్వేదం పురుషసూత్రం 12వ రుక్కు
బ్రాహ్మనోస్య ముఖ మాసిత్ బాహూ రాజన్యకృతః
ఊరు తదస్య యద్వైష్యః పద్భ్యాగోం శూద్రో అజాయతే

బ్రాహ్మలు ముఖం నుండి శూద్రులు పాదాల నుండి పుట్టారని పుట్టుకను రిజర్వేషన్ చేసింది. మరి పంచములు ఎక్కడ నుండి పుట్టారో చెప్పకుండా వాళ్ళకు పుట్టుకే లేకుండా చేసింది.

ఏ ఏ పనులు ఎవరెవరికీ రిజర్వేషన్ ?

అధ్యాపన మధ్యయనం
యజనం యాజనంలతధా
దానం ప్రతిగ్రహ శ్చైవ
బ్రాహ్మనాం అకల్పయత్
చదవడం, చదివించడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం ఇవ్వడం, పుచ్చుకోవడం బ్రాహ్మణ ధర్మాలు

ఏకమేవతు శూద్రస్య
ప్రభుః కర్మ నమాదిశత్
ఏతేషామేవ వర్ణానాం
శూశ్రూషాప్య న సూయయా
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఏ విధమైన అసూయ ద్వేషాలు లేకుండా సేవ చేయడమే శూద్రుల ధర్మం.

ఈ విధంగా పై వారికి సేవ చేయమని శూద్రులకు,
చదవడం బ్రాహ్మణులకు రిజర్వేషన్ చేసింది ఎవరు ?

అసలు ఈ రిజర్వేషన్లు పుట్టించింది ఎవరు ?

చాతుర్ వర్ణం మయా సృష్టిం
గుణ కర్మ విభాగశః
భగవద్గీతకారుడు తానే సృష్ఠించానని చెప్పుకున్నాడు.

అంతేకాదు
ఉత్పన్న కులధర్మానాం
మనుష్యానాం జనార్ధన
నరక నియతం వాస
భవతీత్యనుశు శ్రుమ

కులధర్మాలను పాటించకపోతే నరకానికి పోతారని హెచ్చరించింది

బ్రహ్మదేవుడు శూద్రున్ని దాస్యం కోసమే పుట్టించాడు. (మనుస్ర్ముతి వంద అధ్యయం 413వ శ్లకం)

శూద్రులు వేదాలు, స్మృతులు చదవరాదు. (మనుస్మృతి 2 అధ్యాయం 16 వ శ్లోకం)
శూద్రుల ను నీచమైన పేర్లతో పిలవాలి. (మనుస్మృతి 2 అధ్యాయం 31 వ శ్లోకం)

పనిలోనే కాదు, శిక్షలలో కూడా రిజర్వేషన్లు
బ్రహ్మడు తప్పు చేస్తే ధన ధాన్యమిచ్చి పంపాలి. శూద్రుడు తప్పు చేస్తే వాన్ని చంపాలి. (మనుస్మృతి 9 అధ్యాయం 241వ శ్లోకం)

శూద్రుడు కపిల గోవు పాలు తాగినా, వేదం చదివినా మహాపాపి యగును. పరాశరస్మృతి

శూద్రునికి బ్రాహ్మణ సేవ తప్ప ముక్తికి మర మార్గం లేదు. పరాసరన్మృతి

బ్రాహ్మణు సేవ మానిన శూద్రులు అల్పాయుష్కుగలవారూ, మహాపాపీ అవుతారు. పరాశరస్మృతి

శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కాసీ పోయాలి. చదివితే నాలికనూ, తాకితే చేతులను నరకాలి. విజ్ఞానేశ్వరీయం

పండిత స్వాపి శూద్రస్య శాస్ర్తజ్ఞాన రతస్యచ
వచనం తస్య సగ్రాహ్యమ్ శునఛ్చిష్ఠం హవిర్యధా
హోమంలో పేసే ఆజ్యం యెంత పవిత్రమైనదైనా, కుక్క ముట్టుకుంటే కొరగాకుండా పోతుంది. ఆ విధంగానే శూద్రుడు ఎన్ని శాస్ర్తాలు చదివి పండితుడైనా అతని పాండిత్యం కుక్క ముట్టుకున్న పాలతో సమానం.
చతుర్వింశతి

గుళ్లలో పూజారులుగా 100% బ్రాహ్మణులకు రిజర్వేషన్లు.
చాకిరిలో శూద్రులకు, పంచములకు 100% రిజర్వేషన్లు.

కర్మకాండల పేరుతో దానం పొందడంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్లు.

మున్సీపాల్టీల్లో పారిశుభ్ర కార్మికులుగా పంచములకు, శూద్రులకు రిజర్వేషన్లు.

ఇవి వేల ఏళ్లుగా కులాల పేరుతోసాగుతున్న రిజర్వేషన్లు.

ఈ వేల ఏళ్ళ చరిత్ర కలిగిన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం. ఇవి ఆగాలి.

శూద్రులు, పంచములందరికీ చదువు రావాలి.

గుళ్లల్లో కర్మకాండల్లో పూజారులుగా శూద్రులు, పంచములకు, మహిళలకు వాటా దక్కాలి.

శూద్రుల, పంచముల నీచంగా చూసే కులాల నిర్మూలన జరగాలి.

తరతరాల రిజర్వేషన్లు రద్దు కావాలి.

డబ్బులు పెట్టి సీట్లు కొనే కార్పోరేట్ వ్యవస్థ రిజర్వేషన్లు రద్దు కావాలి

ఆ తరువాత బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లు పోవాల్సిందే.

అవి జరిగే వరకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు ఉండాల్సిందే.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Hyderabad, Telangana
Hyderabad