CONA NEWS
ఉత్తరప్రదేశ్లో రోజు రోజుకు మారే రాజకీయం..బిజెపికి సిఎం అభ్యర్ధి కరవు..వెనుకంజ వేస్తున్న ప్రియాంక, రాహుల్..... బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకునే యత్నాలు
చలసాని నరేంద్ర
దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహజంగానే ఢిల్లీ లో యేర్పడబోయే ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్న ఏ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా ముందుగా ఉత్తర ప్రదేశ్ లో తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుదీర్ఘకాలం ఉత్తరప్రదేశ్ కు చెందిన వారినే ప్రధానమంత్రి పదవి వారిస్తూ వచ్చింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సహితం సాంకేతికంగా ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికైన వారె.
అందుకనే 2014లో ప్రధాన మంత్రి పదవి చేపట్టడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసిన నరేంద్ర మోడీ బిజెపి తనను లాంచనంగా ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించక ముందు నుండే ఉత్తర ప్రదేశ్ పై దృష్టి సారించారు. తనకు నమ్మకస్తుడైన అమిత్ షా ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడంతో పాటు, ఆయనను ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా ప్రకటింప చేసారు. మూడు దశాబ్దాల తరువాత ఒకే పార్టీకి లోక్ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన ఆధిక్యతను నరేంద్ర మోడీ సాధించడానికి ప్రధాన కారణం ఉత్తర ప్రదేశ్ లో బిజెపి గెలుచుకున్న 71 స్థానాలు అని వేరే చెప్పనవసరం లేదు.
2019లో సహితం లోక్ సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఉన్నందున ముందుగా ఈ రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయ త్నించడం ఎపర్తికైనా సహజమే. వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ దృష్ట్యా కీలకంగా మారాయి. ఈ మధ్య ఇదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినా వాటిపై కన్నా ఉత్తర ప్రదేశ్ పైననే బిజెపి తో పాటు కాంగ్రెస్ సహితం దృష్టి సారిస్తూ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ లో ఆధిక్యత సాధించడం ద్వారా 2019 ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయాణం సాగించాలని ఈ రెండు పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రత్యర్దులుగా సమాజ్ వాద్ పార్టీ, బి యస్ పి లు ఉన్నాయి. ఈ పార్టీల అధినేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతి లు సహితం ఉత్తర ప్రదేశ్ లో 50 కు తక్కువ కాకుండా లోక్ సభ స్థానాలను గెలుచుకొంటే ఇతర పార్టీల సహాయంతో ప్రధానమంత్రి పదవి చేపట్ట వచ్చని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పార్టీలకు బలమైన నాయ కులు రాష్ట్రంలో ఉండడంతో, ఆయా పార్టీల యంత్రాంగాలు సహితం బలంగా ఉన్నాయి.
అయితే బిజెపి, కాంగ్రెస్లకు రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేదు. పార్టీ యంత్రాంగం సహితం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందుకనే కాంగ్రెస్ ముందుగానే మేల్కొని 2014లో నరేంద్ర మోడీ కి, 2015లో నితీష్ కుమార్ కు ఎన్నికల మ్యహకర్తగా వ్యవహరించి, వారిని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించు కొంటున్నారు. మొత్తం పార్టీ యంత్రాంగాన్ని దాదాపుగా ఆయన చేతుల్లో ఉంచారు. పార్టీలో ప్రతి కదలిక ఆయన కన్నుసన్నలలో నడుస్తున్నది.
మరో వంక, ప్రధానమంత్రికి సన్నిహితుడైన బిజెపి ప్రధాన కార్యదర్శి ఓం మాథుర్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా బిజేపి ఎన్నికల వ్యూహాన్ని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అద్యక్షుడు అమిత్ షా సహితం వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొంటున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చి న్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం యం యల్ ఏ లతో పాటు గత అసెంబ్లీ ఎన్నికలలో రెండో స్థానంలో వోట్లు తెచ్చుకున్న అభ్యర్ధులను సుమారు 100 నియోజక వర్గా లకు గాను దాదాపుగా ఖరారు చేసారు.
ఈ రెండు పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజలను ఆకట్టుకోగల ముఖ్యమంత్రి అభ్యర్ధి ని గుర్తించడం. బీహార్ ఎన్నికలలో బిజెపి పరాజయానికి ప్రాధాన కారణాలలో ఒక్కటి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందుగ ప్రకటించక పొవడం. ఆ విధంగా ప్రకటించడం ద్వారా అస్సాం లో సంచలన విజయం సాధిం చింది. గత ఎన్నికలలో ఉమా భారతిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు మరో అభ్యర్ధి కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ రెండు పార్టీలు ప్రధానంగా 13 శాతం వరకు ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ దళిత్, ముస్లిం ఓటర్లను సహితం ప్రభావిచం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటె, బిజెపి యాదవులు కాని బి సి ఓటర్లు, అగ్రవర్ణాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది.
ఎన్నికలలో ప్రజలను మంత్ర ముగ్దులుగా చేయడం కోసం కాంగ్రెస్ అధ్య క్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వద్రా ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించమని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు. అయితే అందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సిద్దడటం లేదు. కాంగ్రెస్ కు మిగిలిన 'తుర్ఫ్ ముక్క' ఆమె మాత్రమే అని, అవసరాన్ని బట్టి 2019 ఎన్నికలలో ఉపయో గించు కోవాలని వారు ఆలోచిస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఎన్ని కల ప్రచా రంలో ఆమెను విస్తృతంగా ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం ఆమె మూడు లోక్ సభ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. గాంధీ కుటుంభానికి బలమైన నియోజక వర్గాలుగా పేరొందిన అమేతి, రాయ బరేలి, సుల్తాన్ పూర్ లను ఆమెయే పర్యవేక్షిస్తున్నారు. కిషోర్ కు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల ప్రచారం లలో ఆయన మాటకే విలువ ఇవ్వాలని నిర్ణయిం చినా ఈ మూడు నియోజక వర్గాలలో మాత్రం ఆయనకు ప్రవేశం లేదని స్పష్టం చేసారు.
ఈ నియోజక వర్గాలలో కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను ప్రియాంక గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడ నుండే గెలుపొందుతున్నారు. ప్రియాంక ఎంపిక చేసిన వ్యక్తులే ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అందుకనే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఈ మూడు చోట్ల ఆమె అన్ని నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేసారు.
దానితో ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తీసుకు వచ్చే ఆలోచనలు చేస్తున్నారు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్య మంత్రిగా పనిచేసిన ఆమెకు మంచి ఇమేజ్ ఉంది.
ఇక, అలహాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జరపడం ద్వారా బిజెపి పెద్ద బహిరంగ సభ జరిపి ఎన్నికల శంఖారావాన్ని మ్రోగించింది. అవినీతికి మారుపేరుగా పేరొందిన యస్ పి, బి యస్ పి లను తిరస్కరించి అభివృద్దికి అవకాశం కల్పించే విధంగా తమ పార్టీకి పట్టం కట్టాలని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తారని ఊహా గానాలు జరిగిన ఆ దిశలో పార్టీ ఒక్కడుగు కుడా ముందుకు వేయలేక పోయింది.
స్మృతి ఇరాని, రాజ్ నాధ్ సింగ్, మహేష్ శర్మ, వరుణ్ గాంధీ వంటి వార్ల పేర్లు ఈ సందర్భంగా మీడియాలో వచ్చినా ఎవ్వరూ ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి లకు సముజ్జి కాలేరని గ్రహించారు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా, పలు కులాలకు చెందిన నాయకులకు ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు అప్పచెప్పి ఆయా వర్గాల ఓట్లను ఆకట్టుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు.
అలహాబాద్ యూనివర్సిటీ లో ఆచార్యులుగా, అక్కడ నుండి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన బిజెపి అగ్ర నాయకుడు డా. మురళి మనోహర్ జోషి నగరంలోనే ఉన్నా పార్టీ కార్యవర్గ సమావేశాలకు ఆయన ను లాంచనంగా పిలవక పోవడం వివాదంగా మారింది. దానితో బిజెపి పట్ల బ్రాహ్మణ లలో అనుమానాలు తలెత్తే అవకాశాలు ఏర్పడ్డాయి.
ఈ ప్రమాదాన్ని గుర్తించడంతో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు ఆయనను వేదికపైకి ఆహ్వానించి, ఆయన గురించి నరేంద్ర మోడీ ఘనంగా మాట్లాడారు. పైగా ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీ అభ్యర్ధి కావచ్చే వార్తలను మీడియాకు అందించారు.
ఈ సంవత్సరం చివరకు కోర్ట్ లో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సుప్రేం కోర్ట్ నుండి సానుకుల తీర్పు వస్తుందని బిజెపి సీనియర్ నాయకుడు డా సుబ్రమణియన్ స్వామి ప్రకటించారు. దానితో రామ జన్మభూమి అంశంతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి మాత్రం అభివౄఎద్ధి మంత్రమే ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ విషయమై పార్టీ లోనే కొంతమేరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనను ప్రకటించేటట్లు పార్టీపై వత్తిడి తీసుకు రావడానికి వరుణ్ గాంధీ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలహాబాద్ లో ప్రధాన మంత్రి తో పాటు తన నిలువెత్తు ఫోటో లతో భారే కట్ అవుట్ లను ప్రదర్శించడం ఈ సందర్భంగా పార్టీలో వివాదాస్పదంగా మారింది. అయితే ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో సన్నిహితంగా వ్యవహరి స్తున్నా రని, పార్టీ అంతర్గత అంశాలను సహితం వారికి జేరవేస్తున్నారని బిజెపి నాయకత్వం అనుమానిస్తున్నది. అందుకనే ఆయనకు ప్రాధాన్యత కల్పించడానికి సిద్దపడటం లేదు.
మరో వంక కేంద్రంలో ప్రధాన మంత్రి తరువాత రెండో స్థానంలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ రాష్ట్ర రాజకీయాలకు తిరిగి రావడానికి ఇష్ట పడటం లేదు. ఏదైనా వివాదం ఏర్పటి నరేంద్ర మోడీ రాజీనామా చేయవలసి వస్తే ప్రధానమంత్రి పదవి తనదే అన్న ధోరణిలో ఆయన ఉన్నారు. దానితో ఆయన అద్యక్షతన ఎన్నికల ప్రచార కమిటీని నీయమించె ఆలోచన బిజెపి లో సాగుతున్నది.
ఇక కైరనా లో హిందూ కుటుంభాలు రక్షణ లేని పరిస్థితులలో వలసలు వేడు తున్నాయని అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన బిజెపి ఆత్మరక్షణలో పడిన్నట్లు కనిపిస్తున్నది. అస్సాంలో బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారి విషయమై తీసుకున్న విధంగా ఒక సప్ష్టమైన అంశాన్ని ప్రజల ముందు ఉంచడంలో బిజెపి తప్పటడుగులు వేస్తున్నది. నరేంద్ర మోడీ బొమ్మతో అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిం చడం సాధ్యం కాదని ఢిల్లీ, బీహార్ లలో స్పష్టమైనది. అస్సాం లో వలే ప్రాంతీయ అంశా లను లేవనెత్తే ప్రయత్నంలో ఏమాత్రం విజయం సాధించగలరో చూడవలసి ఉంది.
మరో వంక ఉత్తర్రపదేశ్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో, మరీ ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం ద్వారా పార్టీ కార్యకర్తల మనస్థైర్యన్ని దేబ్బతీసిన్నట్లు కాగలదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తు న్నది.
కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఉత్తర ప్రదేశ్ లో అధికారం అవస రం అనే వాదనను ఆ పార్టీ కొట్టి పారవేస్తున్నది. గత 30 ఏళ్ళుగా ఆ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో 15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్నామనే అంశాన్ని గుర్తు చేస్తున్నది.
ఏది ఏమైనా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో అధికారం కోసం జరుగుతున్నా పోరాటంలో ఈ రెండు జాతీయ పక్షాలు మూడవ, నాల్గవ స్థానాలలోనే ఉన్నా యని చెప్పవచ్చు.
సౌజన్యం ...సూర్య దినపత్రిక
23/05/2016
CHENNAI: One of the first signatures of Tamil Nadu chief minister J Jayalalithaa after taking oath for the sixth time was the one to reduce the timing of liquor shops by two hours and to close 500 Tasmac shops in the state.
Jayalalithaa on Monday signed five welfare schemes as promised in the AIADMK manifesto.
Liquor shops across the state will be opened only between 12 noon and 10pm as against 10am and 10pm at present. All Tasmac shops in the state will work only for 10 hours instead of 12 hours.
The manifesto promised to impose liquor prohibition step by step. Along with lowering the hours, 500 Tasmac shops will also be closed in the state. At present, there are 6,720 liquor shops in the state. Once 500 shops are closed, the number will come down to 6,220.
The chief minister signed an order to waive farm loans pending as of March 31, 2016. "All types of loans taken by small and medium farmers from banks, cooperative banks, loans taken on crops, short and long term loans will be waived. This will cost Rs 5,780 crore for the government's exchequer," said an official press release.
From now on, 100 units of power will be available free to all domestic consumers in the state. More than 78 lakh consumers will get first 100 units free. It will cost Rs 1,607 crore annually and the state government will pay the amount to Tamil Nadu Generation and Distribution Company (Tangedco).
As of now, the government pays Rs 3,000 crore as subsidy for domestic consumers and it will go up to Rs 4,607 crore annually. When free power is given to farmers and powerlooms, the total subsidy will become Rs 6,500 crore. The state government has to pay this amount to Tangedco.
Powerloom weavers across Tamil Nadu will now on get 750 units free power instead of 200 units at present. The cost for Tangedco will be Rs 30 crore and the government has to pay as subsidy to Tangedco.
The chief minister also signed an order to increase the free gold scheme for the marriage of poor girls from 4gms to 8gms.
As of now, 4gms of gold is given to poor girls during their marriage, along with Rs 50,000 to those who are not educated and Rs 25,000 for educated girls. The AIADMK manifesto promised to increase the gold grams from 4gms to 8gms.
12/05/2016
సౌజన్యం: జాగృతి వార పత్రిక
10/05/2016
జి పి ఎ 10 ... మార్కులు...550
జి పి ఎ 9.5 ... మార్కులు...569
పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.... విద్యార్ధులు , తల్లిదండ్రుల 10 జి పి ఎ రాలేదని ఆవేదన. అయితే మొత్తం మార్కులకు విద్యార్ధికి వచ్చిన జి పి ఎ ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు జి పి ఎ 10 వచ్చిన విద్యార్ధికి మార్కులు 550 వచ్చి ఉండే అవకాశముంది. అదేవిధంగా జి పి ఎ 9.5 వచ్చిన విద్యార్ధికి 569 వచ్చే అవకాశముంది. ఓ అవగాహన కోసం ఈ క్రింది పట్టికను పరిశీలించండి.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Bankstreet, Narasaraopet
Guntur
522601