Kandi Ravisankar
02/09/2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.
02/09/2025
02/09/2025
Birthday celebrations of Hon’ble Deputy Chief Minister Shri Konidela Pawan Kalyan Garu Leader of JanaSena Party in Ongole.
02/09/2025
Birthday celebrations of Andhra Pradesh State Deputy Chief Minister, Janasena Party President Sri Pawan Kalyan garu.
24/07/2025
ఈరోజు ఒంగోలు లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి హరి హర వీర మల్లు చిత్రం విడుదల సందర్బంగా అద్దంకి బస్టాండ్ వద్ద నుండి రవి ప్రియ మాల్ వరకు కూటమి పార్టీ ల ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు,ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు,రవిశంకర్ గ్రూప్ అధినేత, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవి శంకర్ గారు కాలినడకన నడిచి భారీ బైక్ ర్యాలీ తో వందలాది యువత సమక్షంలో రవి ప్రియ మాల్ లో భారీ కేక్ కట్ చేయడం జరిగింది,ఈ కార్యక్రమం లో కూటమి పక్ష నాయకులు, కార్యకర్తలు,వీర మహిళలు,పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ఘనవిజయం చేశారు.
12/06/2025
తేది:12.06.2025, కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఒంగోలు నగరంలో విజయోస్తవ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ముందుగా రాజధాని సెంటర్ నందు కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తదుపరి ర్యాలీ గా అద్దంకి బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహం నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత ఐదేళ్ల అంధకారాన్ని తొలగించి, ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసారన్న ఎమ్మెల్యే. ఒంగోలు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది, నియోజకవర్గంలో రూ.130 కోట్ల అభివృద్ధి పనులు చేసామన్న ఎమ్మెల్యే.
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నాం. వికలాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతినెలా రూ.15వేలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలుచేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందించడం జరిగింది. గ్యాస్ పథకంలో సవరణలు తీసుకువచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలుచేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నగదు తల్లుల అకౌంట్లలో జమచేయడం జరుగుతుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారధ్యంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, జనసేన నాయకులు కంది రవిశంకర్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు గారు, మేయర్ సుజాత గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నడం జరిగినది.
09/06/2025
08.06.2025 - జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామం నందు శ్రీ ఉలేరమ్మతల్లి కోలుపులు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ గారు, రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారు
05/06/2025
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా భాష్యం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటిన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ గారు మరియు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారు మొక్కలు నాటి భాష్యం స్కూల్ స్టూడెంట్స్కు మరియు సిబ్బందికి అందరికీ పలు సూచనలు అభినందనలు తెలియచేశారు.
04/06/2025
" సుపరిపాలనకు ఏడాది","పీడ విరగడై ఏడాది".
అరాచక పాలనకు చరమాంకం పలికి జూన్ 4 కు ఏడాది, నియంత పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి, గాడి తప్పిన వ్యవస్థలను చక్కదిద్ది పట్టాలెక్కించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ఏడాది పాలనలో పరుగులు,ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేస్తు రాష్ట్రానికి సిద్ధించిన మహర్దశకు, అరాచక పాలన అంతానికి ప్రతీకగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి దీపావళి వేడుకను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఛైర్మన్ షేక్ రియాజ్ గారు, రవిశంకర్ గ్రూప్ అధినేత, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారు తదితర కూటమి పక్ష నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
04/06/2025
"సుపరిపాలనకు ఏడాది","పీడ విరగడై ఏడాది" సందర్బంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ఒంగోలు నియోజకవర్గం లో కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరం లోనీ 17వ డివిజన్ ప్రగతి కాలనీ లో, 7వ డివిజన్ కమ్మపాలెం లో ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల గారి ఆధ్వర్యంలో, 30వ డివిజన్ రాజపానగల్ రోడ్ 14వ లైన్ వద్ద నగర సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి గారి ఆధ్వర్యంలో, 24వ డివిజన్ బండ్లమిట్ట బండారుపాలెం విధి వద్ద ముగ్గుల పోటీల కార్యక్రమం పండగ వాతావరణంగా జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ ఏజెన్సీ ఛైర్మన్ షేక్ రియాజ్ గారు,రవి శంకర్ గ్రూప్ అధినేత,ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు కంది రవిశంకర్ గారు హాజరయ్యారు.
21/09/2024
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
523001